పోలీసుల గౌరవం పెంచే విధంగా పనిచేయాలి. ఎస్పి సురేందర్ రెడ్డి.

Submitted by srinivas on Tue, 27/09/2022 - 12:11
Work should be done in such a way as to increase the respect of the police. SP Surender Reddy.

భూపాలపల్లి ప్రతినిధి సెప్టెంబర్26  ప్రజాజ్యోతి.  ప్రజలకు ఉత్తమ పోలీసింగ్  అందించి పోలీసుల గౌరవం మరింత పెంచే విధంగాసిబ్బంది కృషి చేయాలని ఎస్పీ సురేందర్ రెడ్డి  పేర్కొన్నారు.  సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ  ఆధ్వర్యంలో ప్రజా దివాస్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 19 మంది ఫిర్యాదారులు హాజరై సమస్యలను ఎస్పీ కి  తెలియజేసి, అర్జీలను ఇచ్చారు. ఈ సందర్బంగా బాధితుల  సమస్యలను తెలుసుకొని సంబంధిత పోలీస్ అధికారులు సమస్యలు  చట్ట పరిధిలో పరిష్కరిoచాలని   ఎస్పి  ఆదేశించారు.  అనంతరం  మాట్లాడుతూ సామాన్య ప్రజలకు పోలీసులు అండగా ఉండాలని, వారితో స్నేహపూర్వకoగా ఉండాలనీ,  శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల  చట్టారీత్యా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.  సమస్య ఎదురైతే  బాధితులు, పిర్యాదు దారులు నిర్భయంగా పోలీసులకు పిర్యాదు చేయాలని ఎస్పి సూచించారు.