Nampally

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 15:20

నాంపల్లి, అక్టోబర్ 3( ప్రజా జ్యోతి ): మండలంలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన మొహమ్మద్ ఖాసిం (46) సం:రాలు  గుండెపోటుతో అకస్మాత్తుగా సోమవారం నాడు మరణించారు. విషయం తెలుసుకున్న నాంపల్లి జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి మృతుని కుటుంబానికి సీనియర్ జిల్లా నాయకులు మాజీ సర్పంచ్ శీలం జగన్మోహన్ రెడ్డి ద్వారా 10000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు కరుణాకర్, మొహమ్మద్ సలీం, పాషా, వెంకటయ్య, మారయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.

మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ - ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 15:15

నాంపల్లి, అక్టోబర్ 2(ప్రజాజ్యోతి ): మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన మత్స్యకారులకు ఆదివారం నాడు చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో  మండల ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేతా రవీందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సమైఖ్య రాష్ట్రంలో మత్స్యకారులను పట్టించుకోకుండా గత ప్రభుత్వాలు మోసం చేశాయని, తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ప్రతి ఏటా మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సిబ్బంది మరియు పలు గ్రామాల మత్స్యకారులు పాల్గొన్నారు.

నూతన ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టిన నాగరాజు రావుల

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 11:59

నాంపల్లి, అక్టోబర్ 2( ప్రజాజ్యోతి):  మండల కేంద్రానికి నూతన ఎస్సైగా నాగరాజు రావుల ఆదివారం నాడు బాధ్యతలు స్వీకరించారు. సైబర్ క్రైబ్స్ నల్గొండ నుంచి నాంపల్లికి బదిలీ పై వచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల ప్రజా ప్రతినిధులు, వివిధ నాయకులు, యువజన సంఘాలు, పత్రికా విలేకరులు  మండల ప్రజలు  సహకరించాలని ఈ సందర్భంగా  వారు తెలిపారు. గతంలో పనిచేసిన ఎస్ఐ డి. హరీష్ రెడ్డి నల్గొండకు బదిలీ అయ్యారు.

అంగరంగ వైభవంగా నాంపల్లి లో బతుకమ్మ సంబరాలు

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 10:49

-శ్రీ కోమటి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బతుకమ్మ ఆట పాటలు 

-మాజీ ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలోకి చేరికలు

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత -మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 15:12

నాంపల్లి,అక్టోబర్ 01(ప్రజాజ్యోతి) : మండలంలోని పసునూర్ గ్రామానికి చెందిన కార్యకర్త తల్లి కేషమల్ల నర్సమ్మ ఇటీవలే మరణించడం జరిగింది. వెంటనే జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి విషయాన్ని తెలుసుకొని మునుగోడు నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  5000 రూపాయల ఆర్థిక సహాయం పసునూర్ మాజీ సర్పంచ్ పోగుల వెంకట్ రెడ్డీ ద్వారా పంపించిగా మృతుని కుటుంబాన్నీ పరామర్శించి, ఆర్థిక సహయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల్ కో ఆప్షన్ సభ్యులు ఎస్కె.అబ్బాస్ ,వార్డు సభ్యులు వెంకన్న, రైతు బంధు కమిటీ గణపురం సర్పంచ్ వారి టీమ్ పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరికలు

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 11:36

నాంపల్లి, సెప్టెంబర్ 30(ప్రజాజ్యోతి ):  నాంపల్లి మండలం మహమ్మదాపురం  ఎంపిటిసి మల్గి రెడ్డి శ్రీదేవి, మాజీ సర్పంచ్ తుమ్మలూరి దయాకర్ రెడ్డి, నాంపల్లి గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్ కర్నాటి మహాత్మా..రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో అదేవిధంగా తుంగపాడు గ్రామ  పంచాయతీ పరిధిలో 10 కుటుంబాల కార్యకర్తలు స్థానిక సర్పంచ్ దండిగ అలివేలు నర్సింహా యాదవ్ ఆధ్వర్యంలో మునుగోడు ఇంచార్జీ మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  సమక్షంలో  హైదారాబాద్ తన నివాసంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు.అనంతరం మంత్రి, మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి కార్యకర్తలను ఆహ్వానిం