సమాజనికి సాయం చేసినోళ్లే గొప్పోళ్ళు
- షాద్నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్
- పెంజర్లలో నిరుపేద కిష్టయ్యకు రెండు ఎడ్లు అందజేత
- జర్నలిస్ట్ మధు సుధన్ గౌడ్" కృషితో దాతల ఆర్థిక సహకారం
- కార్యక్రమానికి హాజరైన జడ్పిటిసిలు, నాయకులు, జర్నలిస్టులు తదితరులు..
సమాజానికి సాయం చేసినోళ్లే గొప్ప వాళ్ళని, జర్నలిస్టులు సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. బుధవారం కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో స్థానిక సర్పంచ్ మామిడి వసుంధరమ్మ ఆమె కుమారుడు మామిడి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన నిరుపేద కూలి కిష్టయ్యకు రూ 95 వేల విలువైన రెండు ఎడ్లను అందజేశారు.