సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందంజలో ఉంది అభినందన్ రెడ్డి
చౌటుప్పల్ అక్టోబర్ 2( ప్రజా జ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలోనే ముందంజలో ఉన్నదని టిఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షుడు నారెడ్డి అభినందన్ రెడ్డి అన్నారు.ఆదివారం చౌటుప్పల్ లో నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ మండల యువజన సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి, తన సొంత స్వలాభం కోసం రాజగోపాల్ రెడ్డి ఇచ్చే డబ్బులకు అమ్ముడుపోయారన్నారు.