యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత్ జోడో పోస్టర్ ఆవిష్కరణ
కరీంనగర్, సెప్టెంబర్ 4 (ప్రజాజ్యోతి) : కరీంనగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రహమాన్ ఆధ్వర్యంలో నగరంలోని హైమద్ పుర చౌరస్తా లో ఆదివారం యూత్ జోడో బూత్ జోడో పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మాజిద్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7 ప్రారంభమయే భారత్ జోడో యాత్రలో యువత, నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని కోరారు.