పేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
- విలేకరులపై దుర్భాషలు ఆడిన పేట ఎమ్మెల్యే పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
- బిజెపి, సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో
నారాయణపేట సెప్టెంబర్ 7, ప్రజా జ్యోతి: ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఫోటోలు తీస్తున్న విలేకరులపై నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి దుష్ భాషలు ఆడడం ఎంతవరకు సమంజసం అంటూ బుధవారం ధన్వాడ మండల కేంద్రంలో చిట్టెం నర్సిరెడ్డి చౌరస్తాలో బిజెపి సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు.