పాలకుర్తి
టీఆర్ఎస్ గ్రామ పార్టీ ఇంఛార్జి ల నియామకం
పార్టీని మరింత బలోపేతం చేయాలి
సంక్షేమ పథకాలు, అభివృద్ధి ని గడప గడపకు వివరించాలి
మండల పార్టీ అధ్యక్షుడు : సిందె రామోజి
పాలకుర్తి / కొడకండ్ల ( ప్రజా జ్యోతి) నవంబర్ 27 : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలతో మండలంలోని అన్ని గ్రామాలకు బిఆర్ఎస్ (టీఆర్ఎస్) గ్రామపార్టీ ఇంఛార్జిలను మండల పార్టీ అధ్యక్షుడు సిందె రామోజీ ఆదివారం నియమించారు. గ్రామాల వారిగా, లక్ష్మక్క పల్లి గ్రామానికి దీకొండ రమేష్, రామన్నగూడెం కే.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ఉన్నత పాఠశాల విద్యార్థులు
అభినందించిన గ్రామ సర్పంచ్, ఉపాధ్యాయులు
పాలకుర్తి / కొడకండ్ల (ప్రజా జ్యోతి) నవంబర్ 25 : రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కొడకండ్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మద్దెబోయిన అభిలాష్ అండర్ 16, గజ్జి మనస్విని అండర్ 12, లాంగ్ జంప్ ఈవెంట్లో ఎంపికయ్యారు. ఈనెల 22న జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారు. డిసెంబర్ 5, 6 తేదీలలో హైదరాబాదులోని గచ్చిబౌలి లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో వీరు పాల్గొంటారు.
కార్పొరేట్ పాఠశాలకు దీటుగా పాఠశాలను తీర్చిదిద్దుతాం : సర్పంచ్ శ్రీలత సోమన్న
విధ్యార్థులకు షూ, టై, బెల్టులు పంపిణీ చేసిన సర్పంచ్
పాలకుర్తి / కొడకండ్ల (ప్రజా జ్యోతి) నవంబర్ 21 : కార్పొరేట్ పాఠశాలకు దీటుగా నర్సింగాపురం పాఠశాలను తీర్చిదిద్దుతామని నర్సింగాపురం గ్రామ సర్పంచ్ దండెంపల్లి శ్రీలత సోమన్న అన్నారు. సోమవారం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ దండంపల్లి శ్రీలత సోమన్న తమ సొంత ఖర్చులతో 12,500 రూపాయల విలువగల షూ, బెల్ట్, టై లను ఉచితంగా పంపిణీ చేశారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసిన జిబి తండ గ్రామస్థులు
పాలకుర్తి / కొడకండ్ల ( ప్రజాజ్యోతి) నవంబర్ 21 : రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కొడకండ్ల మండల జిబి తండ గ్రామస్తులు హనుమకొండ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం గ్రామ అభివృద్ధి కార్యాచరన విషయం లో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ కార్యక్రమంలో జిబి తండా గ్రామ సర్పంచ్ కుమారి గుగులోతు మంజుల, టిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు గుగులోతు బాషా నాయక్ ,గ్రామ నాయకులు వస్రం నాయక్ ,మాజీ ఎంపీటీసీ రామ్ మూర్తి నాయక్ , వీరేష్, మహేష్, వెంకన్న, మహేందర్, సురేష్ , వీరేష్, నరేష్ ,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
2016కు ముందు ఆధార్ కార్డు దిగిన ప్రతి ఒక్కరు కార్డును అప్డేట్ చేసుకోవాలి
తహసీల్ధార్ : కోలా చంద్రమోహన్
పాలకుర్తి / కొడకండ్ల ( ప్రజాజ్యోతి) నవంబర్ 21 : 2016 వ సంవత్సరానికి ముందు ఆధార్ కార్డు దిగిన ప్రతి ఒక్కరు తమ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని కొడకండ్ల మండల తహసిల్దార్ కోల చంద్రమోహన్ సూచించారు. సోమవారం మండల తహసిల్దార్ కార్యాలయంలో ఆధార్ జీవితాన్ని సులభరతరం చేస్తుంది అనే పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు అన్ని అవసరాలకు చాలా శక్తివంతమైనదని అన్నారు. జీవన సౌలభ్యాన్ని సులభతరం చేస్తుందని ఆయన అన్నారు.
ఐలమ్మ పోరాటం నిత్యస్ఫూర్తిదాయకం. బెంగళూరు రచయిత్రి కె.శాంతి కుమారి
ఐలమ్మ పోరాటం నిత్యస్ఫూర్తిదాయకం
-
పాలకుర్తి లో చాకలి ఐలమ్మ మ్యూజియం ఏర్పాటు చేయాలి
-
బెంగళూరు రచయిత్రి కె.శాంతి కుమారి