డిజిటల్ టీవీలతో విద్యార్థులకు సులభతరం
యాదాద్రి(వలిగొండ)సెప్టెంబర్ 03(ప్రజాజ్యోతి న్యూస్):డిజిటల్ టివిలలో పాఠాలు బోధించడం ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థం అవుతుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.శనివారం మండల కేంద్రంలోని శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండలంలోని 28 ప్రభుత్వ పాఠశాలలకు దాత బండారు మయూర్ రెడ్డి సౌజన్యంతో అందజేసిన స్మార్ట్ టివిలను వారు పంపిణీ చేసి మాట్లాడుతూ స్మార్ట్ టీవీలతో పాఠాలు బోధించడం వల్ల విద్యార్థులకు సులభంగా అర్థం అవుతుందని విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు.