Miryalaguda Constituency

పాఠశాల అదనపు గదుల నిర్మాణంలో -నాణ్యత పాటించాలి అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు .

Submitted by venkat reddy on Tue, 27/09/2022 - 13:23

మిర్యాలగూడ ,సెప్టెంబర్ 26(ప్రజాజ్యోతి)ః మిర్యాలగూడ మండలం లోని జప్తివీరప్పగూడెం గ్రామంలో పాఠశాల అదనపు తరగతి గది నిర్మాణ విషయంలో నాణ్యత పాటించాలి.అదేవిధంగా  గతంలో ఉన్న తరగతి గదులు, టాయిలెట్, మరుగుదొడ్లు నిర్మాణాలు 40 ఏళ్లల క్రితం నిర్మాణం కోసం కాంట్రాక్టు తీసుకుని పాత సిమెంట్ పాత గోడలపైన నూతన నిర్మాణం చేప్పడుతున్నారు. ఈ నిర్మాణంలో నాణ్యత లేకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని విద్యార్థులు వారి తల్లిదండ్రులు గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

సొంత అవసరాలకు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను ఉపయోగించుకుంటున్న సర్పంచ్

Submitted by BikshaReddy on Thu, 22/09/2022 - 18:56

(ప్రజా జ్యోతి)మిర్యాలగూడ  : మండల  పరిధిలోని జప్తి వీరప్ప గూడెం గ్రామం లో ఈరోజు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను  గ్రామపంచాయతీ గ్రామ సర్పంచ్ పేలపోలు శ్రీలత తన సొంత అవసరాలకి వినియోగిస్తున్నారు, తన సొంత పొలం నుంచి పెద్ద సైజు రాళ్ళను ట్రాక్టర్లో తోలుతున్నారు ట్రాక్టర్ డ్రైవర్ గా  సంద్రాల దేవయ్య తోలుచున్నాడు ట్రాక్టర్ను గ్రామస్తులు అడ్డుకొని సంబంధిత గ్రామ కార్యదర్శికి ఫోన్ చేసి విషయం చెప్పితే నిర్లక్ష్యం గా సమాధానం చెప్పింది, పై అధికారులకు తెలియజేయగానే అప్పుడు వచ్చింది, గతంలో కూడా వేరే కార్యదర్శి ఉన్నప్పుడు సొంత అవసరాలకు ఉపయోగిస్తే వార్డు మెంబర్స్, డి పి ఓ గారికి ఫిర్యాదు చేస్తే ఇది ఈ డి పి ఆర్ ఓ వచ్చి

నూతన జిల్లా సాధనకు యోగా క్లబ్ సంపూర్ణ మద్దతు

Submitted by shankar on Wed, 14/09/2022 - 15:21

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మిర్యాలగూడ జిల్లా సాధన కోసం కొనసాగుతున్న వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలకు మిర్యాలగూడ యోగా క్లబ్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు యోగా క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చీదెళ్ళ వెంకటేశ్వర్లు,కోలా సైదులు తెలిపారు. బుధవారం స్థానిక మేరెడ్డి రామచంద్రా రెడ్డి స్మారక గ్రంథాలయంలో జరిగిన యోగా శిక్షణలో వారు మాట్లాడారు.జిల్లా ఏర్పాటు ప్రజలందరి ఆకాంక్ష అని,జిల్లా ఏర్పాటు చేయాలని జరుగుతున్న ఉద్యమానికి అందరూ మద్దతు పలకాలని కోరారు.

అన్నదానం మహాదానం

Submitted by kareem Md on Sun, 04/09/2022 - 11:23
  • రాష్ట్ర యువ నాయకులు కుందూరు జైవీర్ రెడ్డి.
  • అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జై వీర్ రెడ్డి.

హాలియా, సెప్టెంబర్03(ప్రజా జ్యోతి): అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు.శనివారం  అనుముల మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో వినాయకుడు వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో కమిటీ పిలుపు మేరకు పాల్గొని వినాయకుడికి  ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.