పాఠశాల అదనపు గదుల నిర్మాణంలో -నాణ్యత పాటించాలి అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు .
మిర్యాలగూడ ,సెప్టెంబర్ 26(ప్రజాజ్యోతి)ః మిర్యాలగూడ మండలం లోని జప్తివీరప్పగూడెం గ్రామంలో పాఠశాల అదనపు తరగతి గది నిర్మాణ విషయంలో నాణ్యత పాటించాలి.అదేవిధంగా గతంలో ఉన్న తరగతి గదులు, టాయిలెట్, మరుగుదొడ్లు నిర్మాణాలు 40 ఏళ్లల క్రితం నిర్మాణం కోసం కాంట్రాక్టు తీసుకుని పాత సిమెంట్ పాత గోడలపైన నూతన నిర్మాణం చేప్పడుతున్నారు. ఈ నిర్మాణంలో నాణ్యత లేకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని విద్యార్థులు వారి తల్లిదండ్రులు గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.