ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 24, (ప్రజా జ్యోతి)..//.. శాంతి సామరస్యతను కాంక్షించి పవిత్ర ఉమ్రా యాత్ర మక్కా సందర్శన కు కుటుంబ సమేతంగా బయలుదేరుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడు సాజిద్ ఖాన్ ను ఆ పార్టీ నాయకులు గణంగా సన్మానించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సాజిద్ ఖాన్ నివాసంలో శనివారం సాజిద్ ఖాన్ ను శాలువాలతో సన్మానించి పూలమాలలు తో సత్కరించారు. ఈ కార్యక్రమం లో పీసీసీ సభ్యులు మహిమూద్ ఖాన్, గుడిపెల్లి నగేష్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెళ్లి శ్రీధర్, సిరికొండ మండల కాంగ్రెస్ అద్యక్షుడు షైక్.ఇమామ్, బజార్ హత్నూర్ మండల కాంగ్రెస్ అద్యక్షుడు సామన్ పెళ్లి.శేఖర్, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి మోషీన్ పటేల్ , జిల్లా ఎస్సి సెల్ ప్రధాన కార్యదర్శి కాంబ్లీ శివాజీ, బీసీ సెల్ నాయకులు సంగరాజు యాదవ్. తదితరులు పాల్గొన్నారు.
- 4 views