ఉర్కొండ సెప్టెంబర్ 17 (ప్రజా జ్యోతి)//. మండల పరిధిలోని ఊర్కొండపేట లో తెలంగాణ జాతీయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గ్రామంలోని బస్టాండ్ దగ్గర 8వ వార్డు సబ్యుడు సిద్దు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అనిత నాగొజి జాతీయ పతాకాన్ని ఎగురవేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగు పెట్టి నీటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జరుపుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుచ్చమ్మ పాపయ్య వార్డ్ సభ్యులు శ్రీను అజహర్ సిద్దు నాయకులు రవి అశోక్ రెడ్డి క్రిష్ణ ప్రవీణ్ రెడ్డి శ్రీశైలం సంజన్న గ్రామ యువకులు అంబేద్కర్ యూత్ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
- 1 view