మురళీ సేవలు చిరస్మరణీయం
వేములవాడ, సెప్టెంబర్ 4 (ప్రజాజ్యోతి) : వేములవాడ వాసవి సత్రం అధ్యక్షుడు ఏగిన మురళీ అందించిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. వాసవి సత్రం అధ్యక్షుడు ఏగిన మురళీ సంస్మరణ సభ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సత్రం కోసం ఏగిన మురళి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఎంతోమందికి సేవ చేసిన వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరమని వారన్నారు.