పుష్ప సినిమా స్టైల్లో రవాణా చేసిన నిందితులు.
చాకచక్యంగా పట్టుకున్నా ఖానాపురం పోలీసులు.
నర్సంపేట (ఖానాపురం) సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి):భారీ స్థాయిలో గంజాయ్ పట్టుబడిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలం బుధ రావు పేట గ్రామ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే సుమారు 550 కేజీలు గంజాయ్ 275 ప్యాకెట్లలో ప్యాక్ చేసి డీసీఎం లో పండ్ల సంబంధిత డబ్బాలలో పగడ్బందీగా రేకులను అమర్చి తరలిస్తుండగా కానాపురం సిఐ సూర్య ఆధ్వర్యంలో డీసీఎం వెంబడించి ఆపి అనుమానిత పండ్ల డబ్బాలను చూడగా భారీ స్థాయిలో గంజాయ్ బయటపడింది. కాగా ఈ గంజాయిని తరలిస్తున్న వారిలో మంగళవారి పేట కు చెందిన వ్యక్తిగా గుర్తించగా మరో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. కాగా ఈ గంజాయి స్కెచ్ పూర్తిగా సినీఫక్కీలో జరగడం పుష్ప మూవీని తలపించింది. పోలీసులు పట్టుబడిన గంజాయిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్న సిఐ సూర్య ను ఆయన బృందాన్ని ఎస్పీ అభినందించారు