మహబూబాబాద్ బ్యూరో సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి): తెలంగాణ రైతాంగ పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శ ప్రాయులుగా నిలిచారని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు.కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని మంగళవారం జరిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.శశాంక కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను స్మరించుకుంటూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తొలితరం పోరాట యోధుడని, ప్రజల పట్ల నిబద్ధత, కార్యదక్షత తో, నిజాయితీగా రాజకీయాల్లో రాణించి, హుందాగా వ్యవహరించారని కలెక్టర్ కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను కొనియాడారు.
అదనపు కలెక్టర్ ఎమ్.డేవిడ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహ స్వామి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎం ఎర్రయ్య, తదితరులు పాల్గొన్నారు.
- 5 views