పాలకుర్తి
బదిలీపై వెళ్లిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ధర్మేంద్ర
సమర్థవంతంగా పనిచేసిన ధర్మేంద్ర : జనగామ డిఐఈఓ బైరి శ్రీనివాస్
పాలకుర్తి / కొడకండ్ల (ప్రజా జ్యోతి) నవంబర్ 18 : కొడకండ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత ఐదున్నర సంవత్సరాల కాలం పాటు ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహించిన శ్రీధర్ల ధర్మేంద్ర బదిలీపై హన్మకొండ జూనియర్ కళాశాలకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కళాశాలలో ప్రిన్సిపాల్ ధర్మేంద్రకు శుక్రవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా డిఐఇఓ బైరి శ్రీనివాస్ మాట్లాడుతూ ధర్మేంద్ర కొడకండ్ల లోనే కాకుండా జనగామ జిల్లా ఇంటర్ విద్యలో కీలక పాత్ర పోషించారని అన్నారు.
పలు అనారోగ్య బాధిత కుటుంబాలను పరామర్శించిన డిసిసిబి వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి
పాలకుర్తి / కొడకండ్ల ( ప్రజాజ్యోతి) నవంబర్ 17 : కొడకండ్ల మండలంలోని పలు అనారోగ్య బాధిత కుటుంబాలను డిసిసిబి వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి గురువారం పరామర్శించారు. మండల రైతు బంధు అద్యక్షుడు దీకొండ వెంకటేశ్వరరావు ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకోగా విషయం తెలుసుకుని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సిందె రామోజీ తో కలిసి మొoడ్రాయి గ్రామంలోని ఆయన నివాసానికి వెళ్ళి పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన గ్రామ రైతుబంధు అధ్యక్షుడు గార్లపాటి ఉపేందర్ రెడ్డి తల్లి ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు.
గోవుల సంరక్షణ అందరి బాధ్యత
గోశాల ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు : మహేష్ అగర్వాల్
పాలకుర్తి / కొడకండ్ల ( ప్రజాజ్యోతి) నవంబర్ 15 : గోవుల సంరక్షణ అందరి బాధ్యత అని,గోవుల సంరక్షణను ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించి సంరక్షించాలని గోవుల సంరక్షణతోనే రైతుల మనుగడ సాధ్యమవుతుందని తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మహేష్ అగర్వాల్ అన్నారు. మంగళవారం కొడకండ్ల మండలంలోని నర్సింగాపురం గ్రామంలో యాకన్న గోశాల ఆధ్వర్యంలో సర్పంచ్ దండెంపెళ్లి శ్రీలతతో కలిసి రైతులకు గోవులను పంపిణీ చేశారు.
ప్రాథమిక పాఠశాల లో ఘనంగా బాలల దినోత్సవం
పాలకుర్తి / కొడకండ్ల ( ప్రజాజ్యోతి) నవంబర్ 14 : భారత దేశ మొట్ట మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా సోమవారం కొడకండ్ల మండల కేంద్రం ఎస్సీ కాలనిలోని ప్రాధమిక పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు విద్యార్థులు ఆకర్షణీయమైన దుస్తులు ధరించి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నెహ్రు వేషధారణలో ఎ.అమ్జత్, ఎదపై ఎర్రటి గులాబీలు ధరించి తెల్లటి టోపితో పాల్గొని ఆకర్షణ గా నిలిచాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దొర్ణం ప్రభాకర్ మాట్లాడుతూ చాచా నెహ్రు గొప్ప నాయకుడని పిల్లలను ప్రేమించి ఆభిమానించే మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.
మంత్రి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ లో చేరిన రామవరం, రామేశ్వరం గ్రామాల కాంగ్రెస్ ,బీజేపీ కార్యకర్తలు
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
పాలకుర్తి /కొడకండ్ల (ప్రజాజ్యోతి) నవంబర్ 13 : :కొడకండ్ల మండలంలోని రామవరం, రామేశ్వరం,గ్రామాలకు చెందిన 15 మంది కాంగ్రెస్,బిజెపి పార్టీ కార్యకర్తలు డీసీసీబీ వైస్ చైర్మన్ కుందురు వెంకటేశ్వరరెడ్డి,టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ ఆధ్వర్యంలో ఆదివారం హన్నంకొండ లోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్యాంపు కార్యాలయంలోమంత్రి దయాకర్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్బంగా మంత్రి వారికి టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
శరీర అవయవ దానం మహాదానం. రచయిత్రి సొన్నాయిల కృష్ణవేణి
శరీర అవయవ దానం మహాదానం.
-
మనిషి మరణం తర్వాత మట్టిగానో,బూడిదగానో మిగలొద్దు
-
మరణానంతరం కూడా మరికొంత మందికి బ్రతుకును ఇవ్వొచ్చు
-
రచయిత్రి సొన్నాయిల కృష్ణవేణి