అనంతగిరి, సెప్టెంబర్27, (ప్రజా జ్యోతి).//..ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని వాయిల సింగారం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుందివాయిల సింగారం గ్రామానికి చెందిన బుర్రా పుల్లయ్య వయస్సు (65) సం లు తన పొలానికి అదే గ్రామానికి చెందిన శేషగిరి తో మందు పిచ్చికారి చేపిస్తుండగా సోమవారం రాత్రి కురిసిన బారి వర్షానికి పొలం పై నుండి వెళ్తున్నా కరెంట్ వైరు తెగి పొలంలో పడినది.అట్టి వైరు గమనించకుండా శేషగిరి కాలుకు వైరు తగిలి కరెంట్ షాక్ కొట్టాగా, పక్కనే ఉన్న బుర్రా పుల్లయ్య పరుగెత్తుకుంటూ శేషగిరి వద్దకు వెళ్ళగా, ప్రమాధవశాత్తు అట్టి వైరు బుర్రా పుల్లయ్య కాలుకు తగిలి కరెంట్ షాక్ కు కొట్టాగా బుర్రా పుల్లయ్య అక్కడిక్కడే మరణించాడు. శేషగిరి ప్రాణాలతో బయటపడినాడు. అని పుల్లయ్య కొడుకు బుర్రా సైదులు ధరఖాస్తు ఇవ్వగా అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనదని ఏఎస్ఐ తెలిపారు.
- 4 views