నడిగూడెం, అక్టోబర్ 2, ప్రజా జ్యోతి: మండల కేంద్రంలో గాంధీ జయంతి వేడుకలను ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దున్న శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దున్నా శ్రీనివాస్ మాట్లాడుతూ సత్యాగ్రహ దీక్షతోనే స్వాతంత్రం సిద్ధించిందని ఆయన చూపిన శాంతి మార్గంలోనే నడవాలని గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపన కొరకు ప్రతి భారతీయుడు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారులు మీర్జా షాకీర్ అలీ బేగ్, ఉపాధ్యక్షులు తంగేళ్ల లింగయ్య, మహమ్మద్ రఫీ, పసుపులేటి సందీప్, ప్రధాన కార్యదర్శి నెమ్మాది రమేష్ కార్యదర్శులు మందుల రాంబాబు, కుంచం ఉపేందర్, ఆర్గనైజర్స్ పులి లక్ష్మణ్,చేరాల వెంకటాచారి, లంజపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు..
- 1 view