గుండాల సెప్టెంబర్ 29(ప్రజా జ్యోతి).//...గురువారం ఎం పి పి తాండ్ర అమరావతి శోభన్ ఆధ్వర్యంలో కొనసాగిన మండల సర్వ సభ్య సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార బ్యాంక్ ఛైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రామాలలోని సమస్యలను గుర్తించి ,వాటి పరిష్కారం కోసం చర్చ జరిపి పరిష్కరించాలని, రైతులు పంట రుణాలు పొందాలని , ఉన్నత చదువుల కోసం పేద రైతు కుటుంబాల విద్యార్థులకు లోన్ అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చెందుతుందని అన్నారు. సమావేశంలో వివిధ గ్రామాలలో సమస్యలను సభా దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయలతో పరిష్కరించాలని సభాధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జ్యోతి, జిల్లా కొప్షన్ ఎండి ఖలీల్ జడ్పిటిసి కోల్కొండ లక్ష్మీరాములు ఎంపీడీవో శ్రీనివాసులు వివిధ గ్రామాల సర్పంచులు ప్రజా ప్రతినిధులు ఆయా శాఖల అధికారులు ఎంపీటీసీలు పాల్గొన్నారు
- 1 view