-వికారాబాద్ జిల్లా గ్రంధాలయాల సంస్థ చైర్మన్ రాజు గౌడ్ కు ఘన సన్మానం..
బీసీలు రాజకీయంగా మరింత ముందుకు రావాలి జాతీయ బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజకుమార్
సెప్టెంబర్ 27 ప్రజా జ్యోతి :- తాండూరు నియోజకవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజు గౌడ్ ను జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్ కుమార్ ఆద్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాస్థాయిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు రాజు గౌడ్ కు జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ పదవి రావడం హర్షదాయకమని జిల్లా బీసీ సంఘం ప్రతినిధులు కొనియాడారు. మంగళవారం నాడు జిల్లా బీసీ సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజు గౌడ్, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్ కుమార్ లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.అనంతరం పలువురు నాయకులు, వక్తలు జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజు గౌడ్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం సంఘ ప్రతినిధులు మాట్లాడుతూబిసి సంఘ యువ నాయకుడు జిల్లా స్థాయి పదవి పొందడం యావత్ బిసి వర్గానికి గర్వకారణమన్నారు.
జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజు గౌడ్ నేతృత్వంలో జిల్లా గ్రంధాలయాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని ఆశ భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బిసి మహిళా అధ్యక్షురాలు మాధవి లత, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకుర్, తాండూరు మహిళా అధ్యక్షురాలు నాయికోటి జ్యోతి, శ్రీనివాస్ చారి, వెంకటేష్, శివానంద్, ఎర్రం శ్రీధర్, రాము ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
- 3 views