మునుగోడులో బిజెపి జెండా ఎగరడం ఖాయం

Submitted by mallesh on Sat, 03/09/2022 - 15:37
The BJP flag is sure to fly in Munugod

చౌటుప్పల్ సెప్టెంబర్ 3 ప్రజా జ్యోతి '.  మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని యాదాద్రి భువనగిరి జిల్లా బిజెపిఉపాధ్యక్షుడు రమన గొని శంకర్ దిమా వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ లింగారెడ్డిగూడెం లో నిర్వహించిన, 43 వ భుత్ కార్యకర్తల సమావేశానికి, ముఖ్య అతిధులుగా రమన గొని శంకర్, మొగుదాల రమేష్ గౌడ్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మొగుదాల రమేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త బూతు స్థాయిలో 60 శాతం ఓట్లు సాధించేలా కృషి చేసి, రాజగోపాల్ రెడ్డి నీ అత్యధిక మెజార్టీతో  గెలిపించి, బిజెపి పార్టీ సత్తా చూపించాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షుడు ఉడుగు వెంకటేష్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్ బాబు, గుజ్జుల సురేందర్ రెడ్డి, బొంగు రాజు గౌడ్, కందాల వెంకట్ రెడ్డి, శివప్రసాద్ , బొదుల యాదయ్య, ప్రవీణ్, అచ్చయ్య, బొమ్మి రెడ్డి సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.