నర్సంపేట చెన్నారావుపేట సెప్టెంబర్ 13 (ప్రజా జ్యోతి) ..మండలంలోని అక్కల్ చెడ గ్రామానికి చెందిన వృద్ధుడు ఇస్లావత్ హనుమ నాయక్ నిన్న రాత్రి మరణించగా విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూక్య గోపాల్ నాయక్ మృతుని పార్దీవ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు . ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తూటి పావని రమేష్,ఉప సర్పంచ్ బాణోత్ వీరన్న నాయక్,గ్రామ పార్టీ అధ్యక్షులు పులిశెరు రాజేందర్,మాజీ అధ్యక్షులు బోనగిరి సారయ్య,గ్రామ పార్టీ ఉపాద్యక్షులు బోనగిరి స్వామి,లావుడ్యా వెంకన్న,నాయకులు వీరు నాయక్,ముత్యం భద్రయ్య,పెద్దమ్మల రాజేందర్,బాలు,ఒంటరి అశోక్,బాబు,శివ కరెడ్ల,రాకేష్,కొమ్మాలు,రవి,కొమురయ్య,కిషన్నాయక్,నర్సయ్య,బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
- 1 view