స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
నల్లగొండ సెప్టెంబర్ 27(ప్రజాజ్యోతి)ప్రతినిధి: పరిశ్రమల స్థాపనలో అనుమతుల మంజూరి దరఖాస్తు లను త్వరితగతిన పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.మంగళ వారం కలెక్టర్ కార్యాలయం లో తన చాంబర్ లొ జిల్లా కలెక్టర్ ఆదేశాల ననుసరించి ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ టీ- ప్రైడ్ పథకం కింద ఎస్.సి.లు ముగ్గురికి ,దివ్యాoగులకు ఇద్దరికి దరఖాస్తులకు పావలా వడ్డీ మంజూరు కి కమిటీ ఆమోదం తెలిపింది.టి-ప్రైడ్ పధకం క్రిందఎస్సీ లు ,ఎస్టీలు దివ్యంగులు 77 దరఖాస్తులకు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ మాజురుకు కమిటీ సిఫారసు చేయడం జరిగిందన్నారు.ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జి.యం. కొటేశ్వర రావు, పరిశ్రమల అనుమతుల కు సంబంధించిన వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- 3 views