వేములవాడ, సెప్టెంబర్ 4 (ప్రజాజ్యోతి) : వేములవాడ వాసవి సత్రం అధ్యక్షుడు ఏగిన మురళీ అందించిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. వాసవి సత్రం అధ్యక్షుడు ఏగిన మురళీ సంస్మరణ సభ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సత్రం కోసం ఏగిన మురళి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఎంతోమందికి సేవ చేసిన వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరమని వారన్నారు.
ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని కృషి చేసిన వ్యక్తి ఏగిని మురళిని ఆయన కొనియాడారు. ఆయన వెంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సంఘ స్వామి యాదవ్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, ఖమ్మం గణేష్, ఆర్యవైశ్య సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.