ప్రజా జ్యోతి అక్టోబర్ 1 చంద్రుగొండ
మద్దుకూరు గ్రామంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పీసా కమిటీ కార్యదర్శి పదం కృష్ణ ఆరోపించారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత కొంతకాలంగా క్రీడా మైదానం పనులు కావాలని కాలయాపన చేస్తూ పనులను అడ్డుకుంటున్నారని,గ్రామంలో కళ్యాణ లక్ష్మి, ఉపాధి హామీ, ఇంకుడు గుంటల్లో అవకతవకలు జరుగుతున్నాయని, కనీసం గ్రామ కార్యదర్శి పీసా చట్టం అంటే తెలియదని సమాధానం చెప్పడం చాలా దురదృష్టకరమన్నారు. గ్రామంలో కళ్యాణ లక్ష్మి పథకంలో చాలా అవకతవకలు జరిగాయని గ్రామంలో కళ్యాణ లక్ష్మి పథకంలో చాలా అవకతవకలు జరిగాయని, పథకాన్ని అడ్డదారి పట్టిస్తుందని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో, ఆదివాసి జేఏసీ నాయకులు కొడెం రాంబాబు, పద్దం నాగరాజు, మడకం నాగరాజు, రావుల కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
- 46 views