మండలాల్లో ఘనంగా గాంధీ జయంతి మహాత్ముని బాటలో పయనిద్దాం ఎంపీపీ బానోత్ పార్వతి

Submitted by veerabhadram on Sun, 02/10/2022 - 16:46
gandhi jayanthi

 చంద్రుగొండ ప్రజా జ్యోతి అక్టోబర్ 2

 జాతివిత మహాత్ముని బాటలో మనమంతా పైనిద్దామని ఎంపీపీ బానోత్ పార్వతీ పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలో ఆమె పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... శాంతితో మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్ముడు ఎంతో గొప్పవాడని అతని మార్గంలో నేటి యువత పయనించాలన్నారు. యువత మంచి మార్గంలో పయనించేలా చూడాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉంటుందన్నారు. చండ్రుగొండ  బస్టాండ్ సెంటర్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో, రావికంపాడు టిఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నరుకుల సత్యనారాయణ, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి, చండ్రుగొండ ఎంపీటీసీ ధారా వెంకటేశ్వరరావు( బాబు),భూపతి శ్రీను, సారేపల్లి శేఖర్, బొజ్యా నాయక్, సయ్యద్ రసూల్, శీను, చాపల మడుగు రామరాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.