నాగారం అక్టోబర్ 2 ప్రజా జ్యోతి./... మండల కేంద్రంలోని ఆజాద్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాతలు పగిలిశెట్టి రామ్ రత్నం, సునీత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సై ముత్తయ్య హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దానాలలో కెల్లా అన్నదానం గొప్పదానమని అన్నారు అన్నం పరబ్రహ్మస్వరూపమని ఎవరు అన్నాన్ని వృధా చేయకుండా అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చిన అన్నదాతలను అభినందించారు. అనంతరం కమిటీ సభ్యులు ఆయనను శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లింగయ్య యాదవ్ ,ఎంపీటీసీ గురి మంజుల, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్, వెంకన్న ,నరేష్, శ్రీనివాస్, ఎల్లయ్య, రవి, ఉదయ్, ఉస్మాన్ ,రాము, సుధా, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
- 2 views