నాగారం 30 సెప్టెంబర్ (ప్రజా జ్యోతి) ../...బాల్యవివాహాలు భవితకు అవరోధాలని ఎంపీపీ కూరం మణి వెంకన్న అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయి బాలల పరిరక్షణ కమిటీ, మరియు అడ్వైజరీ బోర్డు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, సమాజంలో ప్రతి ఒక్కరూ బాల్యవివాహాలను నిర్మూలించాలని తెలిపారు. ఈ సందర్భంగా బాలల పై జరుగుతున్న లైగింక వేధింపుల , అనాధ పిల్లల, అక్రమ రవాణా బాల కార్మికుల పిల్లల సంరక్షణ సమస్యల గురించి వివరించారు.ఈకార్యక్రమంలో ఎంపీడీవో శోభారాణి, జిల్లా పరిరక్షణ విభాగం సౌజన్య , చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ లింగయ్య, ఐసిడిసి సూపర్వైజర్ ప్రమీల ,నాగారం ఎస్సై ముత్తయ్య , ఆర్. ఐ. శాస్త్రి తది తరులు పాల్గొన్నారు.
- 2 views