నాగారం అక్టోబర్ 2 ప్రజా జ్యోతి./....నాగారం మండల పరిషత్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కూరం మణి వెంకన్న గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. అహింసనే ఆయుధముగా మలుచుకుని భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహనీయుడు గాంధీ అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శోభారాణి, సూపర్ ఇంటెండెంట్ ముత్తయ్య, శ్రవణ్ ,జానీ, వెంకన్న, రాము, నరేష్, సురేష్, విజయ, రాధిక తదితరులు పాల్గొన్నారు.
- 4 views