నాగారం అక్టోబర్ 2 ప్రజా జ్యోతి./...ఇటీవల పిడుగుపాటుతో నాగారం మండలానికి చెందిన కాట్రే వుల గంగమ్మ మృతి చెందడంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న తుంగతుర్తి బిజేపి నియోజకవర్గ సభ్యులు కడియం రామచంద్రయ్య ఆదివారం మృతురాలి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, సోమేష్, మహేష్, కిరణ్, లింగయ్య,, ఐలయ్య, శివ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
- 3 views