పాలక వీడు,సెప్టెంబర్29(ప్రజా జ్యోతి): సూర్యాపేట జిల్లా పాలకీడు మండల ఆర్యవైశ్య సంఘమునకు నూతన అధ్యక్షులుగా 25-09- 2022 ఆదివారం ఉదయం 11:30 నిమిషాలకు పాలకీడు లో జరిగిన మండల జనరల్ బాడీ సమావేశము నందు మాశెట్టి లక్ష్మయ్య ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభాధ్యక్షులుగా తక్షణ మాజీ అధ్యక్షులు పోలిశెట్టి రాంబిక్షం వహించగా ప్రధాన కార్యదర్శి గుండా బిక్షపతి రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్ యుటిఎఫ్ నాయకులు గతములో నిర్వహించిన కార్యక్రమాలు సభకు వివరించారు. మండల సంఘం కోశాధికారి ఊటుకూరి సైదయ్య , పాలకీడు గ్రామ అధ్యక్షులు యాదా ఈశ్వరయ్య , ముఖ్య అతిథులుగా జిల్లా సంఘం అధ్యక్షులు మాశెట్టి అనంతరాములు , ఉపాధ్యక్షులు గుండా రమేష్ ఎంపీటీసీ పాల్గొన్నారు. ఎన్నికల అధికారిగా కందగట్ల అనంత ప్రకాష్ నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన ఆర్యవైశ్య సోదరులు పలు అంశాలపై చర్చల్లో పాల్గొని పేద వైశ్యులకు తోడ్పడాలని కోరారు.జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ పాలకీడు మండలం చైతన్యవంతమైనది సభ్యత్వంలో సేవా కార్యక్రమంలో ముందుంజలో వున్నారన్నారు.
జిల్లా సంఘం ఎల్లప్పుడు తోడ్పాటు ఇస్తుందని తెలిపారు. యిదే సందర్భంలో ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టిమేలు తలపెట్టు అను సూక్తిని సార్ధకం చేస్తూ హనుమాయి గూడెం గ్రామం కు చెందిన పేద వైశ్యుడు కోటగిరి శంకరయ్య కుమారుడు లక్ష్మినారాయణ హైదరాబాద్ టీ కే ఆర్ కళాశాల లో పాలిటెక్నీక్ చదువుచున్న పేద విద్యార్థి ఫీజు కొరకై జిల్లా అధ్యక్షుల వారి చొరవతో సమావేశంలో తోడ్పాటును అందించమని కోరగా స్పందించిన సోదరులు 5 నిమిషాల్లో 26 వేల రూపాయలు అక్షరాల 26 వేల రూపాయలు రావడం, తక్షణమే విద్యార్థికి ఇవ్వడం క్షణాల్లో జరిగింది. స్పందన వెల్లువిరిసింది. నిజమైన పేద విద్యార్ధులు ఎక్కడున్నా ఆ ప్రాంతంలో ఉన్న సంఘాలు చొరవతో సహాయం అందించాలని కోరారు. మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని పాలకీడు మండలం వారు నిరూపించారు.
- 1 view