లబ్ధిరులకు చెక్కులు పంపిణీ చేస్తున్న నల్లమల
బోనకల్, అక్టోబర్ 03, ప్రజాజ్యోతి: ఖమ్మం పార్లమెంట్ సభ్యులు,తెరాస లోక్ సభపక్షనేత నామా నాగేశ్వరరావు సిఫార్స్ మేరకు మంజూరైనా చెక్కులను ఎంపి క్యాంప్ కార్యాలయంలో సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు.బోనకల్ మండలం పెద్దబీరవల్లి గ్రామానికీ చెందిన యనమద్ది శెషయ్య, కోనంగి వెంకయ్య, కుక్కల వేంకటేశ్వర్లు లకు 25000 రూపాయలు,యర్రగాని జ్యోతి 18000వేల రూపాయాల చెక్కును లబ్ధిదారులకు డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, రైతు సమన్వయ కమిటీ జిల్లా అద్యక్షులు నల్లమల వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు,మండల తెరాస అద్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు,తెరాస నాయకులు తన్నీరు రవి,గ్రామ తెరాస పార్టీఅధ్యక్ష, కార్యదర్శలు యనమద్ది శ్రీనివాసరావు,రెడ్డిబోయిన ఉద్దండ్ ఆధ్వర్యంలో అందించారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- 21 views