మహబూబ్ నగర్, సెప్టెంబర్ 26 (ప్రజాజ్యోతి ప్రతినిధి) : సోమవారం జిల్లా కలెక్టర్ వెంకటరావు స్టేడియం గ్రౌండ్ ముందు ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న ఆర్చి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్చ్ నిర్మానంతో పాటు, రహదారి పనులను కూడా ఒకే సమయంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఈడబ్ల్యుఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామచందర్ ను ఆదేశించారు .నిర్మాణం సందర్భంగా పెద్ద పెద్ద వృక్షాలు ఇబ్బందులు కలగకుండా వాటిని సంరక్షిస్తూ నిర్మాణ పనులు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్చి నిర్మాణాన్ని పరిశీలిస్తూ లే అవుట్ లో సూచించిన విధంగా నిర్మాణాలు ఉండాలని, నాణ్యతలో లోపం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు .
- 1 view