కొనసాగుతున్న కనకదుర్గ నవరాత్రి ఉత్సవాలు
నిడమనూరు, సెప్టెంబర్ 27(ప్రజాజ్యోతి)ః నిడమనూరు మండలకేంద్రంలో కనకదుర్గదేవి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. కనకదుర్గ శరనవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కనక దుర్గ దేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.ఈసందర్భంగా మంగళవారం నిడమనూరు కనకదుర్గమ్మ అమ్మవారుగాయత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం కనకదుర్గ ఉత్సవ కమిటీ సభ్యులు జమలుపూరి నర్సింగ్ దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం కనకదుర్గ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఘనంగా పూజలు నిర్వహించారు.