ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నిక
- మునుగోడు తాజా మాజీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చండూర్ సెప్టెంబర్1( ప్రజా జ్యోతి): మునుగోడు నియోజక వర్గంలో జరిగే ఉప ఎన్నిక రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నిక అని మునుగోడు తాజా మాజీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.బుధవారం చండూర్ మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కోడి గిరిబాబు రాజగోపాల్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో చేరారు.