చండూర్ ఆగస్టు 30.( ప్రజా జ్యోతి). రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువత భారీగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మునుగోడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.
మంగళవారం మండల పరిధిలోని నేర్మట గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన యువకులు టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పెద్ద గోని వెంకన్న ఆధ్వర్యంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఉప ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో నేర్మెట గ్రామ శాఖ అధ్యక్షుడు నారపాక శంకరయ్య, ఈరటి శ్రీశైలం, ఈరగట్ల నరసింహ, బోయపల్లి వేణు, వరికుప్పల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
- 3 views