తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత
ప్రజా జ్యోతి తిరుమలగిరి టౌన్ 26సెప్టెంబర్.//.. డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మండల అధ్యక్షుడు షేక్ చాంద్ పాషా సోమవారం తిరుమలగిరి మండల తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండా సీనియారిటీ ,పేదరికం ప్రాతిపదికన ఇళ్ల స్థలాల కేటాయించి ఇండ్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసి వెంటనే అమలు చేయాలని కోరారు.