నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని నిరసన సీఐటీయూ
నల్లగొండ అక్టోబర్ 03(ప్రజాజ్యోతి)./... పెరుగుతున్న నిత్యవసరం వస్తువుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం ఆరోపించారు.సోమవారం అంతర్జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అంతర్జాతీయ యాక్షన్ డే నిరసన పిలుపు మేరకు హమాలి ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ దేశంలో ధరలు, అవినీతి, నిరుద్యోగం పెరిగిపోతున్నాయని వీటిని అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.