లయన్స్ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షుడు కలిమిచర్ల రమేష్,
కల్వకుర్తి, అక్టోబర్2( ప్రజా జ్యోతి): అహింస అనే ఆయుధంగా చేసుకుని సత్యాగ్రహ దీక్షతో ఆంగ్లం తరిమికొట్టి యావత్ ప్రపంచాన్ని స్ఫూర్తిగా నిలిచిన జాతిపిత మహాత్మా గాంధీ మార్గం అనుసరణీయమని లయన్స్ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షుడు కలిమిచర్ల రమేష్ అన్నారు.ఆదివారం జాతిపిత
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో పట్టణంలోని ఆ మహనీయుని విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కోశాధికారి దుగ్గి వెంకటేష్, పిఆర్వో చిగుళ్ళపల్లి శ్రీధర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మిరియాల శ్రీనివాస్ రెడ్డి,సభ్యులు శ్రీనివాస్,గుబ్బ కిషన్,పోల హరి,గోవింద్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు..
- 3 views