అచ్చంపేట సెప్టెంబర్ 25 ప్రజా జ్యోతి. కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అచ్చంపేట పట్టణంలో భక్త మార్కండేయ ఆలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు జరుపుకున్నారు అదేవిధంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మార్కండేయ ఆలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారికి పద్మశాలీలు ప్రత్యేక పూజలు నిర్వహించారు రెండవ రోజు బాల త్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనమిచ్చారు మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలతో పాటు గణపతి హోమం మల్లికార్జున స్వామికి అభిషేకం అమ్మవారికి పూజలు బతకమ్మ కోలాటాల కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి కోట కిషోర్ అధికారి రవీందర్ మహిళా సంఘం అధ్యక్షురాలు శకుంతల ఆలయ అధ్యక్షుడు పర్వతాలు న్యాయ సలహాదారు పులిజాల రమేష్ సుధాకర్ మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.ఫోటో రైట్ అప్.అమ్మవారి పూజలు నిర్వహిస్తున్న పద్మశాలీలు
- 3 views