వాటర్ ట్యాంక్ ను తొలగించాలని డిమాండ్
దేవరుప్పుల,అక్టోబర్ 21, (ప్రజాజ్యోతి):-
మండలంలోని భూక్యతండాలో గత కొన్ని నెలలుగా వాటర్ ట్యాంక్ నిరుపయోగంగా ఉంది. దీంతో అది శిధిలావస్థకు చేరింది అలాగే దానికి సంబంధించిన ఓ పిల్లర్ ఒకవైపు పాడైపోయింది. అయితే దాని పక్కనే భూక్య వెంకటేష్ అనే వ్యక్తి ఇల్లు ఉండడంతో అది ఎప్పుడు కూలిపోతుందో అనే భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ పంచాయితీ పాలకవర్గం కు చెపితే పట్టించుకోవడం లేదని, సంబంధిత అధికారులు పట్టించుకోని సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
- 10 views