కాజిపేట్, సెప్టెంబర్29 (ప్రజాజ్యోతి)./...అమ్మ దుర్గాదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శ్రీశ్రీశ్రీ దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు భాగంగా నాలుగో రోజు సందర్భంగా గురువారం కాజీపేట లో నిత్య పూజలో వినయ్ భాస్కర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవీ ఉపాసకులు అయినవోలు ప్రవీణ్ కుమార్ శర్మ, శివశక్తి యూత్ సభ్యులు మిట్టపల్లి రవీందర్, బెదరకోట రంజిత్ కుమార్, నాగవెల్లి శ్రీధర్, కొదిరిపాక రఘు, కొదిరిపాక అశోక్, భరత్, హరి, ప్రశాంత్, సంతోష్, కమల్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
- 2 views