గుర్రంపోడ్:అక్టోబర్ 02(ప్రజా జ్యోతి)./...జాతిపిత మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నేటి యువత ముందుకు సాగాలని గుర్రంపోడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తగుళ్ళ సర్వయ్య యాదవ్ అన్నారు.మహాత్మా గాంధీ 153 వ జయంతి సందర్భంగా ఆదివారం ఆయన మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శాంతి, సహనంతో బ్రిటీష్ వారితో పోరాడి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ అని కొనియాడుతూ,మహాత్ముని అడుగుజాడల్లో నేటి యువత ముందుకు సాగి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సూదిని జగదీశ్వర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చనమల్ల జగదీశ్వర్ రెడ్డి,మాజీ మండల పార్టీ అధ్యక్షుడు జాల చిన్న సత్తయ్య యాదవ్,మండల కాంగ్రెస్ నాయకులు వెలుగు యాదయ్య ముదిరాజ్,మర్రెడ్డి యాదగిరి రెడ్డి,ఇటికాల శేషయ్య, మండలి లింగయ్య యాదవ్,భగవంత్,చిరంజీవి, వెంకన్న, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి టంగుటూరి సురేష్,మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కమతం జగదీశ్వర్ రెడ్డి,యువజన కాంగ్రెస్ నాయకులు కొత్త నాగరాజు,బొడ్డుపల్లి నరేష్,జాల నవీన్,భూతం తిరుపతి,షేక్ జానీ, గణేష్,సత్యం తదితరులు పాల్గొన్నారు.
- 3 views