మత్స్యకారులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
టీఆర్ఎస్ నాయకులు జంగయ్య
ఉర్కొండ సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి),.///,మండలంలోని తిమ్మన్న పల్లి జగబోయిన్ పల్లి చెరువుల్లో శనివారం టీఆర్ఎస్ నాయకులు చేప పిల్లలను వదిలారు ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స్యకారులకు అండగా చెరువులల్లో చేప పిల్లలను వదిలి ఆ చేపలను పెంచి మత్స్యకారులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకంలో భాగంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి సహకారంతో మండలంలోని రేవల్లి & తిమ్మనపల్లి చెరువులో సుమారుగా 45 వేలు జగబోయినపల్లి చెరువులో 35 వేల చేప పిల్లలు మొత్తం 80 వేల చేపపిల్లను చెరువుల్లో వదలడం జరిగిందనీ తెలిపారు ఈ కార్యక్రమంలో జంగయ్య రవీందర్ సర్పంచులు సుదర్శన్ సునీత సాంబశివుడు కవిత మణిపాల్ రెడ్డి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గిరి నాయక్ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరారెడ్డి మండల నాయకులు బచ్చలకూర రమేష్ కొమ్ము శీను రాచకొండ గోపి బండి మల్లేష్ వెంకటయ్య మత్స్యకార సంఘం ప్రెసిడెంట్ తిరుపతయ్య సభ్యులు శీను తదితరులు పాల్గొన్నారు.
- 2 views