టి.ఆర్.ఎస్.వి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కినగేష్
బిబినగర్, సెప్టెంబర్ 06 (ప్రజా జ్యోతి)తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభివృద్ధి ధ్యేయంగా ఎంతో చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 500 మందికి దళిత బంధు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి చేయలేని విధంగా తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు అని టి.ఆర్.ఎస్.వి జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కినగేష్ అన్నారు. బిబినగర్ మండల కేంద్రంలో వారు మాట్లాడుతూఅన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైన దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని రూపొందించారాని అన్నారు. దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం పాటుపడుతున్నారని కేసీఆర్ కు దళిత సమాజం అందరూ అండగా నిలవాలని కోరారు. దళితులందరూ ఆర్థికాభివృద్ధిని సాధించాలి ఇది సీఎం కేసీఆర్ సంకల్పం అని నియోజకవర్గానికి 500 చొప్పున యూనిట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు ప్రజలు ఋణ పడి ఉంటారు అని ఉద్గాటించారు.
- 1 view