నాంపల్లి, అక్టోబర్ 3( ప్రజా జ్యోతి ): మండలంలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన మొహమ్మద్ ఖాసిం (46) సం:రాలు గుండెపోటుతో అకస్మాత్తుగా సోమవారం నాడు మరణించారు. విషయం తెలుసుకున్న నాంపల్లి జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి మృతుని కుటుంబానికి సీనియర్ జిల్లా నాయకులు మాజీ సర్పంచ్ శీలం జగన్మోహన్ రెడ్డి ద్వారా 10000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు కరుణాకర్, మొహమ్మద్ సలీం, పాషా, వెంకటయ్య, మారయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.
- 2 views