దేవరకొండ -సెప్టెంబర్ -7(ప్రజా జ్యోతి ) డిండి మండల కేంద్రానికి చెందిన పలువురు రైతులు 2009 సంవత్సరంలో కోల్పోయిన వ్యవసాయ భూమికి పట్టాలు ఇప్పించాలని జాతీయ బిసి కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి,జిల్లా కలెక్టర్, దేవరకొండ ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.ఈ సమస్యను త్వరగా పరిష్కరించి రైతులకు పట్టాలు ఇప్పించాలని స్థానిక ఎంపీటీసీ ఏటి రాధికా కృష్ణా పలువురు రైతులతో కలిసి బుధవారం తహసీల్దార్ ప్రశాంత్ కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో డిండి ఉపసర్పంచ్ వెంకటేష్ ,ఏ టి కృష్ణ ,పొలం లక్ష్మణ్, ఎడమ ఎల్లయ్య ,వావిళ్ల చిననరసింహ తదితరులు పాల్గొన్నారువినతిపత్రం అందజేస్తున్న రైతులు
- 1 view