- విలేకరులపై దుర్భాషలు ఆడిన పేట ఎమ్మెల్యే పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
- బిజెపి, సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో
నారాయణపేట సెప్టెంబర్ 7, ప్రజా జ్యోతి: ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఫోటోలు తీస్తున్న విలేకరులపై నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి దుష్ భాషలు ఆడడం ఎంతవరకు సమంజసం అంటూ బుధవారం ధన్వాడ మండల కేంద్రంలో చిట్టెం నర్సిరెడ్డి చౌరస్తాలో బిజెపి సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా బిజెపి నారాయణపేట జిల్లా కిషన్ మోర్చా కార్యదర్శి గోవర్ధన్ గౌడ్, సిపిఐ నారాయణపేట జిల్లా కార్యవర్గ సభ్యులు పి. వెంకటేశులు ,బిజెపి మండల అధ్యక్షులు మాకం సురేందర్ లు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమంలో పాత్రికా విలేకరులు ఫోటోలు తీస్తుండగా నియోజకవర్గం ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి ఎంతవరకు సమంజసమన్నారు. పేట ఎమ్మెల్యే అహంకారంతో అధికారం బలంతో ప్రజా సమస్యలపై వివరించే ,రాసే విలేకరులపై నియోజకవర్గ ఎమ్మెల్యే తిట్టడం సమంజసం కాదన్నారు.
ప్రజల సమక్షంలో తిట్టిన పేట ఎమ్మెల్యే విలేకర్లకు క్షమాపణ చెప్పాలన్నారు. లేనియెడల బిజెపి సిపిఐ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారు హెచ్చరించారు. విలేఖరి ఇమామ్ మాట్లాడుతూ అహంకారం బలంతో ఉన్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పై చర్యలు తీసుకునే వరకు ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు.
- 4 views