అలంపూర్,( ప్రజా జ్యోతి) అక్టోబర్ 2: మహాత్మ గాంధీ జయంతిని, అలంపూర్ చౌరస్తా లో, ఆర్ కిషోర్, కార్యాలయం నందు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఆర్ కిషోర్ మాట్లాడుతూ.. బ్రిటీష్ వారి బానిస సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు అహింసాయుతంగా పోరాటం చేసిన మహాత్మగాంధీ, పోరాటం నేటి యువతరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు, గ్రామ స్వరాజ్యం ద్వారానే ప్రజలకు మేలు జరుగుతుందన్నా గాంధీ ఆశయాన్ని ఆచరణలో పెడుతూ, గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు, ఈ కార్యక్రమంలో భరత్ రెడ్డి, ఆనంద్, విజయ్ నాయుడు, విష్ణు గౌడ్, మధు, హుస్సేన్, దగ్గుపాటి తిరుమల్, ప్రభాకర్, బిసన్న, రవి, డేవిడ్, ప్రవీణ్, కార్తీక్, మదన్, దినకర్,కృష్ణ, రాఘవేంద్ర ,తదితరులు పాల్గొన్నారు.
- 3 views