- జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులతో మాట్లాడుతున్న అధికారులు
అచ్చంపేట సెప్టెంబర్ 12 ప్రజా జ్యోతి ; బల్మూర్ బీసీ బాలికల వసతి గృహాన్ని కస్తూర్బా గాంధీ పాఠశాలను సోమవారం అధికారులు తనిఖీ చేశారు సందర్భంగా తహసిల్దార్ క్రిస్టియ నాయక్ ఎంపీడీవో దేవన్న సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా బీసీ బాలికల వసతి గృహంలో చాలా రోజుల నుంచి విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్న మ్యాట్రిన్ పట్టించుకోవడంలేదని వచ్చిన ఫిర్యాదు మేరకు బీసీ బాలికల వసతి గృహాన్ని సందర్శించి వివిధ సమస్యల గురించి విద్యార్థులతో మాట్లాడటం జరిగిందని తాసిల్దార్ తెలిపారు.
వసతి గ్రహంలో ఇద్దరు విద్యార్థులు జ్వరంతో బాధపడుతున్నారని వారితో మాట్లాడి ఆ విద్యార్థులను వెంటనే హాస్పిటల్కి చూపించాలని సంబంధిత మ్యాటీన్.కు అధికారులు సూచించారు దీంతోపాటు వసతి గృహంలో పరిసరాల పరిశుభ్రత సక్రమంగా లేకపోవడంతో అధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇకముందు విద్యార్థుల పట్ల హాస్టల్ పరిసరాల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు కార్యక్రమంలో బల్మూరు పంచాయతీ కార్యదర్శి చంద్రు నాయక్ తదితరులు ఉన్నారు.
- 2 views