మునుగోడు అక్టోబర్ 01(ప్రజా జ్యోతి): మునుగోడు మండల పలు గ్రామాల నుండి గ్రామ సర్పంచులు మరియు మండల నాయకులు బిజెపిలోకి
మాజీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డిగారు తన స్వగృహంలో నల్లగొండ DCCB డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి గారి సమక్షంలో బిజెపి కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన కల్వలపల్లి సర్పంచ్ వంటపాక జగన్,జక్కలవారి గూడెం సర్పంచ్ జక్కల శ్రీను కిస్టాపురం సర్పంచ్ నందిపాటి రాదా రమేష్, మునుగోడు కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సాగర్ల లింగస్వామి యాదవ్, కొత్త శంకర్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
- 3 views